Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో చుక్కలు తాకుతున్న చికెన్ ధరలు

Webdunia
ఆదివారం, 17 మే 2020 (13:02 IST)
తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు చుక్కలు తాకుతున్నాయి. గతంలో వేసవి కాలంలో ఎన్నడూ చూడనంత స్థాయిలో చికెన్ ముక్క ధరలు పెరిగిపోయాయి. 
 
నిజానికి నెల రోజుల క్రితం వరకు వంద రూపాయలకు మూడు నుంచి నాలుగు కేజీల చికెన్ ఇచ్చారు. మరికొన్ని చోట్ల కేజీ చికెన్ కొనుగోలు చేస్తే అర కేజీ చికెన్ ఫ్రీ అంటూ బోర్డులు పెట్టారు. దీనికి కారణం బర్డ్ ఫ్లూ కారణంగా ధరలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడమే. 
 
అయితే, ఈ వేసవిలో మాత్రంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా చికెన్ ధరలు పెరిగిపోయాయి. రెండు రోజుల క్రితం రూ.257కు చేరుకుని ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 
 
ఈ ధర మరింత పెరిగిపోయింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో చికెన్‌ ధర రూ.290 పలుకుతుంది. ఆదివారం చికెన్ కొందామని మార్కెట్లోకి వచ్చిన ప్రజలు ధరల గురించి తెలుసుకుని విస్మయానికి గురవుతున్నారు. వేసవిలో ఈ స్థాయిలో రేట్లు పెరగడం ఇదే తొలిసారని చికెన్ వ్యాపారులు తెలిపారు.
 
అంతేకాదు, రాబోయే రోజుల్లో చికెన్ ధర‌ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. కరోనా నేపథ్యంలో వచ్చిన వదంతుల కారణంగా కొన్ని రోజుల క్రితం వరకు కోడి మాంసం ముట్టేందుకు బెదిరిపోయిన ప్రజలు ఇప్పుడు భారీగా ఎగబడుతున్నారు. 
 
కరోనా భయంతో నెల రోజుల క్రితం ఎన్నడూ లేనంతగా తగ్గిన చికెన్ ధరలు ప్రస్తుతం మండిపోతున్నాయి. లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయిన సామాన్య ప్రజలు పెరిగిన ధరలతో చికెన్‌ ముక్కలకు దూరమవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments