Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు

Webdunia
ఆదివారం, 24 మే 2020 (23:44 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. సోమవారం విశాఖ, విజయవాడకు విమానాలు రద్దు చేసినట్లు సమాచారం.

ప్యాసింజర్లు తక్కువగా ఉండటం, ఇతర కారణాలతో విమానాలను రద్దు చేశారు. చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయితే రోడ్డు మార్గంలో అమరావతి వెళ్లే అవకాశం ఉంది. 27, 28 తేదీల్లో అమరావతి నుంచే మహానాడు కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

కాగా చంద్రబాబు విశాఖ వెళ్లేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన  సోమవారం ఉదయం విమానంలో విశాఖకు వెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతులను కూడా ఏపీ డీజీపీ నుంచి తీసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబుకు డీజీపీ ఈ పాస్ కూడా జారీ చేశారు.

అయితే ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నెల 26 నుంచి విమానాలను నడిపేందుకు కేంద్ర పౌరవిమానయానశాఖ అనుమతిచ్చింది. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులను నడపాలని తొలుత నిర్ణయించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సోమవారం రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ ఎయిర్ పోర్టులను మూసివేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments