Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు

Webdunia
ఆదివారం, 24 మే 2020 (23:44 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. సోమవారం విశాఖ, విజయవాడకు విమానాలు రద్దు చేసినట్లు సమాచారం.

ప్యాసింజర్లు తక్కువగా ఉండటం, ఇతర కారణాలతో విమానాలను రద్దు చేశారు. చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయితే రోడ్డు మార్గంలో అమరావతి వెళ్లే అవకాశం ఉంది. 27, 28 తేదీల్లో అమరావతి నుంచే మహానాడు కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

కాగా చంద్రబాబు విశాఖ వెళ్లేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన  సోమవారం ఉదయం విమానంలో విశాఖకు వెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతులను కూడా ఏపీ డీజీపీ నుంచి తీసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబుకు డీజీపీ ఈ పాస్ కూడా జారీ చేశారు.

అయితే ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నెల 26 నుంచి విమానాలను నడిపేందుకు కేంద్ర పౌరవిమానయానశాఖ అనుమతిచ్చింది. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులను నడపాలని తొలుత నిర్ణయించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సోమవారం రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ ఎయిర్ పోర్టులను మూసివేయనున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments