Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాలయాల భూములు విక్రయిస్తే పోరాటానికి సిద్ధం: కన్నా

Webdunia
ఆదివారం, 24 మే 2020 (23:40 IST)
దేవాలయాల భూములు విక్రయిస్తే సహించేదిలేదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఆలయాల భూములు విక్రయిస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు.

భక్తులు కానుకగా ఇచ్చిన భూములను కాపాడటం చేతకావడంలేదా? అని ఆయన ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. నిరర్దక ఆస్తుల పేరుతో భూములు విక్రయించడం దారుణమని చెప్పారు.

ఆలయాల భూమి గజం కూడా అమ్మడానికి వీల్లేదన్నారు. కరోనా హడావుడిలో అందరూ ఉంటే సింహాచలం భూములను కబ్జా చేశారని ఆరోపించారు.

సింహాచలం భూములను కబ్జాచేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయాల భూముల పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ...మంగళవారం రోజున నిరసనలు చేపడతామని తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments