Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదు .. లోపాలను సరిదిద్దుతాం : చంద్రబాబు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (15:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని, ఈ జిల్లాల ఏర్పాటుపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సరిదిద్దుతామని ఆయన వెల్లడించారు. 
 
కొత్త జిల్లాల ఏర్పాటుపై పార్టీ నేతలతో ఆయన సోమవారం చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రం మరో శ్రీలంకలా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రధాని వద్ద ఉన్నతాధికారుల వ్యాఖ్యలే ఈ రాష్ట్ర పరిస్థితికి నిదర్శనమన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు కూడా అశాస్త్రీయంగా ఉందన్నారు. ఈ జిల్లాల ఏర్పాటు రాజకీయ కోణంలో తీసుకున్న అంశమని పేర్కొన్నారు. 
 
రాజధాని అమరావతిలో 80 శాతం మేరకు జరిగిన పనులను కూడా ఏపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శలు చేశారు. జగన పాలనపై ఆయన సొంత సామాజికవర్గం కూడా సంతృప్తిగా లేదని అన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం పదవులు ఇస్తున్నారని, జగన్‌కు ఓటేసి తప్పు చేశామన్న భావన ఇపుడు సొంత నియోజకవర్గంలోనే కనిస్తుందన్నారు. ఇకపోతే సీపీఎస్ అంశంలో ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని చంద్రబాబు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments