Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏప్రిల్ 4న కొత్త జిల్లాలపై ఏపీ సర్కారు ప్రకటన

webdunia
బుధవారం, 30 మార్చి 2022 (14:21 IST)
ఏప్రిల్ 4న కొత్త జిల్లాలపై ఏపీ సర్కారు ప్రకటన చేయనుంది. ఏప్రిల్ 4న ఉదయం. 09.05 నుంచి, 9.45మ‌ధ్య కొత్త జిల్లాల అవ‌త‌ర‌ణ‌.. ఆంధ్రప్రదేశ్‌లో నూతన జిల్లాల ఏర్పాటు తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సీఎం జ‌గ‌న్ చేతుల మీదుగా కొత్త జిల్లాల ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌నుంది. 
 
ఈ కొత్త 26జిల్లాల‌కు ఇప్పిటికే కేబినెట్ ఆమోదం తెలిపింది. వ‌ర్చువ‌ల్‌గా మంత్రివర్గం ఆమోద‌ముద్ర వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో విషయంలో అభ్యంతరాలు, సూచనలు వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. 
 
కొత్త జిల్లాలు ఏర్పాటయితే జవహర్ నవోదయ విద్యాలయాలు, మెడికల్ కాలేజీల లాంటి వాటిని కేంద్రాన్ని అడిగే అవకాశం ఉంటుందని చెప్పారు. 
 
కొత్త జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారని.. 3 లక్షల చదరపు అడుగుల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల మృతి