Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు సలహా బాగుంది.. విజన్ సిద్ధం చేయండి : ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (10:03 IST)
హస్తిన వేదికగా జి-20 సమావేశం సన్నాహకాల్లో భాగంగా, సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలకు పైగా ఈ కీలక భేటీ జరిగింది. ఇందులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానంగా డిజిటల్ నాలెడ్జ్ అంశంపై మాట్లాడారు. దేశ ప్రగతిపై వచ్చే 25 యేళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని సూచించారు. వచ్చే పాతికేళ్లలో భారత్ మొదటి లేదా రెండో స్థానానికి చేరడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
మన దేశానికి ఉన్న ప్రధాన బలం యువశక్తి అని బాబు గుర్తు చేశారు. వారికి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు తమ విధి విధానాలను రూపొందించుకోవాలని బాబు పిలుపునిచ్చారు. దేశానికి మానవ వనరుల శక్తిని నాలెడ్జ్ ఎకానమీకి అనుసంధానిస్తే అద్భుతమైన ఫలితాలు అందుకోవచ్చని చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. 
 
ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో చంద్రబాబు చేసిన నాలెడ్జ్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించండం గమనార్హం. ఈ సమావేశం నేపథ్యంలో ప్రధాని మోడీతో చంద్రబాబు పది నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారు. పలు అంశాలపై ఇరువురు చర్చించుకోవడం గమనార్హం. ముఖ్యంగా, చంద్రబాబు చెప్పిన విషయాలన్నీ ప్రధాని మోడీ ఆసక్తిగా ఆలకించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments