Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రజలు గాజులు తొడుక్కుని కూర్చోలేదు : చంద్రబాబు

తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌తో పోల్చవద్దంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రజలు చేతగానివాళ్లేం కాదని, గాజులు తొడుక్కుని కూర్చోలేదంటూ వ్యాఖ్యానించారు.

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (14:42 IST)
తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌తో పోల్చవద్దంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రజలు చేతగానివాళ్లేం కాదని, గాజులు తొడుక్కుని కూర్చోలేదంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో గురువారం జరిగిన ‘ఇండియా టుడే కాంక్లేవ్‌’లో సదస్సులో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. 
 
శుక్రవారం రెండో రోజు సదస్సు ప్రారంభంకాగా, పలువురు ఉన్నతాధికారులు కేసీఆర్ మాటలపై అభ్యంతరం వెల్లడించారు. ఆపై మరోసారి మాట్లాడిన చంద్రబాబు, ఏపీ ప్రజలు చేతగాని వాళ్లేం కాదని అన్నారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాన్ని మాట మాత్రమైనా అడగకుండానే రాష్ట్రాన్ని విడదీశారని ఆరోపించారు. 
 
ప్రజల ప్రమేయం లేకుండానే విభజన జరిగిపోయిందన్నారు. అన్ని వర్గాలతో మాట్లాడి ముందడుగు వేయాలని, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని తాను అడుగుతుంటే, కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగిందని అంగీకరిస్తున్న వారు, న్యాయం చేసేందుకు ఆలస్యం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments