Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రయాణీకుడికి సారీ చెప్పిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు

తనవల్ల ఇబ్బందిపడ్డ ఓ సామాన్య వ్యక్తికి సీఎం సారి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రోజు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిముందు గంటకు పైగా ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా ఆదారిలో రెండు గంటలు పాటు వాహన రాకపోకలను నిలిపివేశారు.

ప్రయాణీకుడికి సారీ చెప్పిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు
, మంగళవారం, 16 జనవరి 2018 (22:18 IST)
తనవల్ల ఇబ్బందిపడ్డ ఓ సామాన్య వ్యక్తికి సీఎం సారి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రోజు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిముందు గంటకు పైగా ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా ఆదారిలో రెండు గంటలు పాటు వాహన రాకపోకలను నిలిపివేశారు. దీంతో హైదరాబాదు నుండి స్వగ్రామం వెళ్ళుతున్న చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం, దిగువ మూర్తిపల్లెకు చెందిన నవీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పక్కనున్న ఎ.రంగంపేట గ్రామం నుండి సుమారు కిలో మీటర్ దూరం కాలినడకన పోతూ సీఎం ఇంటి వద్దకు చేరుకోగా అక్కడ సీఎం ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా నవీన్ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. 
 
సీఎం చొరవ తీసుకుని సమస్య ను అర్థం చేసుకుని నవీన్ కు సారీ చెప్పాడు. వెంటనే ట్రాఫిక్‌ని సమస్యను పరిష్కరిచమని పోలీసులను అదేశించారు. దీంతో తన ఇబ్బంది గుర్తించి నందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయాడా వ్యక్తి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్దనోట్ల రద్దు... 12 వేల ఎకరాలు కొన్న శశికళ?