Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక మోడీతో సయోధ్య లేదు.. సమరమే.. ఎంపీలతో చంద్రబాబు

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కూడా పూర్తిగా విఫలమైందనీ, ముఖ్యంగా, శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధాని నరేంద్ర

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (14:14 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కూడా పూర్తిగా విఫలమైందనీ, ముఖ్యంగా, శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల అమలు చేయకుండా మోసం చేశారనీ పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వెళ్లగక్కారు. ఇకపై కూడా ఆయన న్యాయం చేస్తారన్న నమ్మకం లేదనీ ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల తాడోపేడో తేల్చుకోవాలని సూచన చేశారు. 
 
రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబు మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఉదయం ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉభయసభల్లో మన ఎంపీలు బాగా పని చేశారని కితాబిచ్చారు. ముఖ్యంగా, గల్లా జయదేవ్ ప్రసంగాన్ని ఆయన ప్రశంసించారు.
 
మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎక్కడైనా ప్రతిపక్షం ముందుండి పోరాటం చేస్తుందని... కానీ, కేసుల భయంతో వైసీపీ ఆ పని చేయలేకపోతోందని చెప్పారు. ఉభయసభల్లో మన ఎంపీలంతా మన గళాన్ని గట్టిగా వినిపించాలని... మన పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 
 
విభజన హామీల్లో చట్ట ప్రకారం రాష్ట్రానికి ఇవాల్సి నిధుల మంజూరులో కేంద్రం మోసం చేసింది. మూడున్నరేళ్ళగా ఊరించి రేపు, మాపు అంటూ వాయిదాలు వేస్తూ చివరికి ఎన్నికల మందు బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు సైతం తగ్గించేశారు. ఇలాగైతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో కేంద్రానికి గుణపాఠం చెబుతారంటూ ఆయన ఆక్రోశం వెళ్ళగక్కారు. అంతేకాకుండా, బీజేపీతో ఉన్న సంబంధాలపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments