Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఇలానే ఉంటాయి.. చంద్రబాబు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (12:14 IST)
పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఓ మంచి ఉదాహరణ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 
 
జాకీ బ్రాండ్ దుస్తుల తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్ ఏపీని వదిలివేసి తెలంగాణా రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఏపీలో పరిశ్రమను నెలకొల్పే ఆలోచనను విరమించుకుంది. పైగా, ఈ కంపెనీకి గత టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసింది. అదేసమయంలో తెలంగాణాలో రెండు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 
 
ఈ పరిశ్రమ వెనక్కి వెళ్లిపోవడంపై చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ అని అన్నారు. 
 
రాయలసీమలో తాను తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయి? పెట్టుబడులు తరిమేసింది ఎవరు? సీమ ద్రోహులు ఎవరు? సీమకు పరిశ్రమలు తెచ్చిన మేమా లేక కాసులకు కక్కుర్తిపడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాకుండా, నేతలను మేపలేక జాకీ పరార్ అంటూ ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని కూడా ఆయన ట్యాగ్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balagam Actor: బలగం నటుడు మొగిలయ్య కన్నుమూత

పోలీస్ ట్రైనీ మీనాక్షితో వెంకటేష్ ప్రేమలో పడితే ఏం జరిగింది?

Keerthy Suresh mangalsutra: మంగళసూత్రంతో కీర్తి సురేష్.. ఎరుపు రంగు దుస్తుల్లో అదిరిపోయింది...

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments