Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనలా చేయడం వల్లనే పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్... వైసీపి వాళ్లకు అర్థం కాదిది: బాబు

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (20:32 IST)
అమరావతి రాజధాని అంశంపై వైసీపి నాయకులు చేస్తున్న భిన్న ప్రకటనలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా దీనిపై మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు.
 
''సమాజం కోసం చేసిన కృషి ఎప్పుడూ ఫలిస్తుంది. అందుకు ఆనాడు హైదరాబాద్‌లో చేసిన అభివృద్దే నిదర్శనం. పుల్లెల గోపీచంద్‌కు అప్పట్లో గచ్చిబౌలిలో 5 ఎకరాలు ఆకాడమీ కోసం ఇచ్చాం. ఇప్పుడు అక్కడ క్రీడా మాణిక్యాలు తయారవుతున్నాయి. పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ అయి తెలుగువారికి గర్వకారణంగా నిలిచింది.
 
తెలుగు ప్రజలకు ఒక శాశ్వత ఆస్తి ఉండాలని అమరావతికి శ్రీకారం చుట్టాం. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా రూపొందించాం. వైసీపీ వాళ్ళకు ఇవన్నీ అర్థం చేసుకునేంత పరిజ్ఞానం లేదు. చెబితే వినేంత విజ్ఞతా లేదు. ఒక్క అవకాశం అంటూ వచ్చి అమరావతి మనుగడనే ప్రశ్నార్థకం చేసారు.
 
కొత్తగూడెం, అశ్వారావుపేట నుంచి వచ్చిన తెతెదేపా కార్యకర్తలు, నాయకులతో ఈ రోజు సమావేశమయ్యాను. తెలంగాణలో నాయకులు వెళ్ళినా కార్యకర్తలెవరూ పార్టీని వీడలేదు. వారి నుంచే మళ్ళీ నాయకులను తయారుచేసి తెలంగాణాలో తెదేపా పుంజుకునేలా చేస్తా. ఏపీ, తెలంగాణలో తెదేపా శాశ్వతంగా ఉండటం చారిత్రక అవసరం'' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments