Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనలా చేయడం వల్లనే పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్... వైసీపి వాళ్లకు అర్థం కాదిది: బాబు

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (20:32 IST)
అమరావతి రాజధాని అంశంపై వైసీపి నాయకులు చేస్తున్న భిన్న ప్రకటనలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా దీనిపై మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు.
 
''సమాజం కోసం చేసిన కృషి ఎప్పుడూ ఫలిస్తుంది. అందుకు ఆనాడు హైదరాబాద్‌లో చేసిన అభివృద్దే నిదర్శనం. పుల్లెల గోపీచంద్‌కు అప్పట్లో గచ్చిబౌలిలో 5 ఎకరాలు ఆకాడమీ కోసం ఇచ్చాం. ఇప్పుడు అక్కడ క్రీడా మాణిక్యాలు తయారవుతున్నాయి. పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ అయి తెలుగువారికి గర్వకారణంగా నిలిచింది.
 
తెలుగు ప్రజలకు ఒక శాశ్వత ఆస్తి ఉండాలని అమరావతికి శ్రీకారం చుట్టాం. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా రూపొందించాం. వైసీపీ వాళ్ళకు ఇవన్నీ అర్థం చేసుకునేంత పరిజ్ఞానం లేదు. చెబితే వినేంత విజ్ఞతా లేదు. ఒక్క అవకాశం అంటూ వచ్చి అమరావతి మనుగడనే ప్రశ్నార్థకం చేసారు.
 
కొత్తగూడెం, అశ్వారావుపేట నుంచి వచ్చిన తెతెదేపా కార్యకర్తలు, నాయకులతో ఈ రోజు సమావేశమయ్యాను. తెలంగాణలో నాయకులు వెళ్ళినా కార్యకర్తలెవరూ పార్టీని వీడలేదు. వారి నుంచే మళ్ళీ నాయకులను తయారుచేసి తెలంగాణాలో తెదేపా పుంజుకునేలా చేస్తా. ఏపీ, తెలంగాణలో తెదేపా శాశ్వతంగా ఉండటం చారిత్రక అవసరం'' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments