Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఎంజీఆర్, ఎన్టీఆర్ తరహా వ్యక్తిని.. సీఎం జగన్

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (20:16 IST)
తనకు తాను పార్టీ పెట్టుకుని వచ్చిన వారిని ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారని, తాను తొలి ఇద్దరు నేతల జాబితాకు చెందిన వ్యక్తినని ఏపీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో పర్యటించారు. ఆయన జగనన్న శాశ్వత భూహక్కు పత్రాలను పంపిణీ చేశారు. 
 
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తూ కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేసిన వాళ్లను చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. ఎన్నికలపుడు మాయమాటలు చెప్పి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటన్నారు. మోసం చేసే చంద్రబాబుకు మళ్లీ అధికారాన్ని ఇవ్వొద్దని ఆయన కోరారు. 
 
తాను చంద్రబాబు నాయుడు తరహాలో దుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదన్నారు. ఆ దేవుడుని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. వైకాపా ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకుని, మీకు మంచి జరిగితే మీ బిడ్డనైన తనకు అండగా ఉండాలని ప్రజలను కోరారు. 
 
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వేను చేపడుతున్నామని జగన్ తెలిపారు. 17 వేలకు పైగా గ్రామాల్లో భూముల సర్వే చేస్తున్నామని చెప్పారు. తొలి దశలో 2 వేల గ్రామాల్ల భూ రికార్డులను ప్రక్షాళన జరిగిందన్నారు. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలను అందించామని తెలిపారు. 
 
వచ్చే యేడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సర్వే పూర్తవుతుందని చెప్పారు. సర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను నియమించామని, రూ.1000 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. పైగా, భూముల రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల్లోనే జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments