Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు బెయిల్ పిటిషన్‌పై మరోమారు వాయిదా

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (12:50 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో మరోమారు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీలోని ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఆ తర్వాత ఏపీ హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై మంగళవారం ఉదయం హైకోర్టు విచారణ చేపట్టి ఆ పై కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జడ్జి వెల్లడించారు. 
 
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు గత 39 రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయంతెల్సిందే. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తొలుత ఏసీబీ కోర్టును ఆశ్రయించగా, అక్కడ కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఇక్కడు కూడా వాయిదాల పర్వం కొనసాగుతుంది. మూడు రోజుల క్రితం విచారణ చేపట్టింది. అయితే, తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలని చంద్రబాబు నాయుడు న్యాయవాదులు కోరడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం