Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉండవల్లి గ్రామ ఓటర్లుగా చంద్రబాబు కుటుంబ సభ్యులు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఉండవల్లి గ్రామ ఓటర్లుగా మారిపోయారు. ఈ మేరకు వారి పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో ఎక్కించింది.

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (15:07 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఉండవల్లి గ్రామ ఓటర్లుగా మారిపోయారు. ఈ మేరకు వారి పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో ఎక్కించింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు వచ్చి, ఉండవల్లి కరకట్టపై ఉన్న భవనాన్ని నివాసంగా మార్చుకుని చంద్రబాబు పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామంలో తమను ఓటర్లుగా చేర్చాలని చంద్రబాబు కుటుంబం దరఖాస్తు చేసుకుంది. 
 
దీన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం అధికారులు.. సీఎంతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి పేర్లను ఇంటి నంబర్ 3-781/1లో ఉంటున్నట్టు నమోదు చేసి, ఓటరు లిస్టులోకి ఎక్కించారు. దీంతో ఇకపై జరిగే ఎన్నికల్లో చంద్రబాబు ఫ్యామిలీ సభ్యులు ఉండవల్లి గ్రామస్తులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments