Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం!!

Nuclear Power Plant
Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:43 IST)
కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్తను చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాంట్ శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో నిర్మిస్తామని మంగళవారం రాజ్యసభలో ప్రకటించింది. 
 
టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రం స్పష్టతను ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ఈ ప్లాంటును నిర్మించబోతున్నామని... 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ప్లాంటులో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. 
 
ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అమెరికాకు చెందిన 'వెస్టింగ్ హౌస్ ఎలెక్ట్రిక్' సంస్థతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది. పలు అధ్యయనాల తర్వాత కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు చెప్పింది.
 
కాగా, గతంలో కూడా ఇక్కడ అణు విద్యుత్ కర్మాగారం నిర్మించేందుకు ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టగా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇపుడు ఇదే ప్రాంతంలో ప్రధాని మోడీ సర్కారు ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments