Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కనబెట్టండి : ఉపరాష్ట్రపతి

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (22:39 IST)
తిరుపతి విమానాశ్రయంలో 177 కోట్ల రూపాయలతో ఎయిర్ పోర్ట్ విస్తరణ - బలోపేతం పనులను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధిలో భాగస్వామ్యంలో కావాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలంటే సంస్కరణలు అవసరమన్నారు. ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిష్కరించబోతోందన్నారు. 
 
తిరుపతి అభివృద్థి వేగంగా జరుగుతుండడం సంతోషంగా ఉందని, తిరుపతి విమానాశ్రయంలో రన్ వే పనులు త్వరగా పనులు పూర్తయి అంతర్జాతీయ రాకపోకలు సాగాలని ఆకాంక్షించారు. స్వచ్ఛభారత్ కు ప్రజలు సహకరించాలని కోరారు. తిరుపతిలో రైల్వేస్టేషన్ లో ఆధునిక వసతులను రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తానని చెప్పారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ప్రసిద్థి చెందిన ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతని, అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ విమాన రాకపోకలు సాగనున్నాయని చెప్పారు. పెరుగుతున్న ప్రయాణీకుల దృష్ట్యా తిరుపతి విమానాశ్రయంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments