Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్యకు ముందు.. తర్వాత.. కోర్టుకు ఫోన్ కాల్స్ వివరాలు

Webdunia
గురువారం, 4 మే 2023 (16:36 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకు ముందు ఆ తర్వాత కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు అనేక పలువురు నిందితుల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఫోన్ కాల్స్‌ను సీబీఐ బహిర్గతం చేసింది. ఈ వివరాలను హైకోర్టుకు ఒక కౌంటర్ అఫిడవిట్ రూపంలో సమర్పించింది. మార్చి 14వ తేదీ సాయంత్రం నుంచి మార్చి 15వ తేదీ వరకు ఫోన్ కాల్స్ వివారలను వెల్లడించింది. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిల మధ్య సంభాషణ వెల్లడించింది. అలాగే, అవినాష్, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డిల మధ్య జరిగిన సంభాషణలను కూడా బహిర్గతం చేసింది. వీరిలో సునీల్ యాదవ్ - దస్తగిరి మధ్య అత్యధిక ఫోన్ కాల్స్ జరిగాయి. 
 
* వైఎస్ అవినాశ్ రెడ్డి తన తండ్రి వైఎస్ భాస్కర రెడ్డికి మార్చి 14వ తేదీ సాయంత్రం 6.18 నిమిషాలకు ఓ ఫోన్ కాల్ చేశారు. 
* ఉదయ్ కుమార్ రెడ్డి మార్చి 14న రాత్రి గం.9.12 నిమిషాలకు, ఆ తర్వాత మార్చి 15న ఉదయం గం.6.10 నిమిషాలకు... రెండుసార్లు వైఎస్ అవినాశ్ కు ఫోన్ చేశాడు.
* శివశంకర్ రెడ్డి మార్చి 15వ తేదీ ఉదయం గం.5.58 నిమిషాలకు వైఎస్ అవినాష్‌కు ఫోన్ చేశాడు. మార్చి 14న సాయంత్రం నుండి రాత్రి వరకు మూడుసార్లు ఫోన్ చేశాడు.
* గంగిరెడ్డి మార్చి 14న రాత్రి గం.8.02 నిమిషాలకు, మార్చి 15న ఉదయం మరోసారి శివశంకర రెడ్డికి ఫోన్ చేశాడు.
* గంగిరెడ్డి మార్చి 14న రెండు సార్లు సునీల్ యాదవ్ కు ఫోన్ చేశాడు. 
* ఉమాశంకర్ రెడ్డి మార్చి 15న ఉదయం గంగిరెడ్డికి ఒక ఫోన్ కాల్ చేశాడు.
* ఉమాశంకర్ రెడ్డి ఐదుసార్లు సునీల్ యాదవ్‌కు ఫోన్ చేశాడు. 2 ఎస్సెమ్మెస్‌లు పంపించాడు. సునీల్ యాదవ్ కూడా రెండుసార్లు ఉమాశంకర్ రెడ్డికి ఫోన్ చేశాడు.
* షేక్ దస్తగిరి మూడుసార్లు సునీల్ యాదవ్‌కు ఫోన్ చేశాడు. 22 ఎస్సెమ్మెస్‌లు పంపించాడు. 
* సునీల్ యాదవ్ రెండుసార్లు షేక్ దస్తగిరికి ఫోన్ చేశాడు. 4 ఎస్సెమ్మెస్‌లు పంపించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments