Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (19:01 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు హైదరాబాద్ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. తన కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన కోర్టును కోరిన విషయం తెల్సిందే. 
 
విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ కొన్ని రోజుల క్రితమే ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో విదేశాలకు వెళ్లేందుకు వీలుగా తన బెయిల్ నిబంధనలు సడలించాలంటూ కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఆయన విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది. 
 
కాగా, అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోందని, జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. కానీ కోర్టు మాత్రం ఇరు వర్గాల వాదనలు ఆలకించి సానుకూలంగా స్పందించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments