Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులపైనే కేసులు.. మదనపల్లె, సీఐ, ఎస్సైలు అరెస్ట్

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (15:28 IST)
నేరస్తులపై కేసులు నమోదు కావడం మామూలే. అయితే చిత్తూరు జిల్లాలో ఏకంగా ఎక్సైజ్ సీఐ, ఎస్సెపై కేసులు నమోదు కావడం సంచలనం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. మదనపల్లెలోని ఎస్బీఐ కాలనీకి చెందిన నాదెళ్ల వెంకటేశ్వరప్రసాద్‌ రెండున్నరేళ్లుగా పట్టణంలోని ఆనంద్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారన్నారు. 
 
ఇందులో ఎక్సైజ్‌ ప్రభుత్వ మద్యం డిపో సీఐ జవహర్‌బాబు, ఎస్‌ఐ సురేష్‌కుమార్‌‌లకు బార్‌లో వాటాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
ఈ క్రమంలో మద్యం విక్రయాల్లో తేడాలు రావడం.. డిపో నుంచి వైన్‌షాపులకు పంపాల్సిన మద్యాన్ని బార్‌లో ఉంచి అధిక ధరలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. వరుసగా ఇలాంటి విభేదాలతో లీజుదారుల మధ్య ఇటీవల గొడవలు జరగడంతో బార్‌ను మూసి వేశారు. 
 
సీఐ, ఎస్సై అనుచరులు ఆదివారం బార్‌ ఆక్రమణకు ప్రయత్నించడంతో వెంకటేశ్వర ప్రసాద్, ఆయన అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసుల అక్కడికి చేరుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.
 
వెంకటేశ్వర ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు సీఐ జవహర్‌బాబు, ఎస్‌ఐ సురేష్‌కుమార్‌, ఆయన అనుచరులపై ఆరు సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
ఈ ఐదుగురికి 41 నోటీసులు జారీ చేశారు. బార్‌ వివాదం కేసులో ఎక్సైజ్‌ సీఐ జవహర్‌బాబు, ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments