Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందా? లేదా? : పూర్వ వాదనల దాఖలుకు నేడు ఆఖరు రోజు

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (09:09 IST)
స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన వ్యాజ్యంలో ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి శుక్రవారం ఆఖరిరోజు. గత మంగళవారం వాదనలు ముగించి వాయిదా వేసిన తీర్పును ధర్మాసనం ఎప్పుడు వెలువరిస్తుందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. శనివారం నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు దసరా సెలవులు. 30వ తేదీన న్యాయస్థానం పునఃప్రారంభమవుతుంది. 
 
ఈ నేపథ్యంలో పూర్వ వాదనలను స్వీకరించిన తర్వాతే ఈ కేసులో తీర్పును వెలువరిస్తుందా లేదా దసరా సెలవుల తర్వాత విచారిస్తుందా అన్న అంశంపై ఇపుడు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ కేసులో ప్రభుత్వ సీఐడీ అధికారులు తమ పూర్వ వాదనలు సమర్పించేందుకు చివరి నిమిషం వరకు వేచి చూడాలని భావిస్తున్నారు. కోర్టు పని వేళలు ముగిసే చివరి నిమిషానికి ముందు వీటిని దాఖలు చేసే అవకాశం ఉందని, తద్వారా ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించకుండా మరో కొంతకాలం అంటే దసరా సెలవుల తర్వాత తీర్పు వచ్చేలా చేయాలన్నదే వారి వ్యూహంగా ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగానే సీఐడీ తరపు న్యాయవాదులు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments