Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వరూపానందేంద్ర స్వామికి రాజధాని సెగ.. టూర్‌ను అడ్డుకున్న మహిళలు

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (13:38 IST)
విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి రాజధాని అమరావతి సెగ తాకింది. గుంటూరులో ఉన్న గోరంట్ల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన స్వరూపానందేంద్రకు రాజధాని ప్రాంత మహిళలు చుక్కలు చూపించారు. ఆయన కారుకు అడ్డుగా నిలబడి, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. పైగా, స్వరూపానందేంద్ర స్వామి కూడా అమరావతికి మద్దతు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో వైకాపా నేతలు, పోలీసులు రంగప్రవేశం చేసి స్వామిని సురక్షితంగా ఆలయంలోకి తీసుకెళ్లారు. 
 
కాగా అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తోన్న ఆందోళనలు శుక్రవారానికి 52వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు వెలగపూడి, ఐనవోలు, నవులూరుతో పాటు పలు ప్రాంతాల్లో రైతులు నిరసన తెలుపుతున్నారు. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 52వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడిలో రైతులు 24 గంటల దీక్షలను కొనసాగిస్తున్నారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరుకు వచ్చిన స్వరూపానందేంద్ర స్వామి గుంటూరుకు రావడంతో అమరావతి సెగ తగిలింది.
 
కాగా, స్వరూపానందేంద్ర స్వామికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెల్సిందే. ముఖ్యమంత్రి కాకముందు.. సీఎం అయిన తర్వాత సీఎం జగన్ తరచుగా విశాఖ శారదాపీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం తీసుకుని, గంటల కొద్ది మంతనాలు జరుపుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments