Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ డీజీవీ గౌతం సవాంగ్ విశాఖ పర్యటన వెనుక నిజం ఇదేనా?

Webdunia
సోమవారం, 6 జులై 2020 (16:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ బాస్ (డీజీపీ) గౌతం సవాంగ్ ఇటీవల విశాఖపట్టణంలో పర్యటించారు. ఈ పర్యటన వెనుక అసలు నిజం ఇపుడు వెల్లడైంది. నిజానికి రాజధాని తరలింపులో భాగంగానే విశాఖలో గ్రేహౌండ్స్‌ నిర్వహణ, శిక్షణ సంస్థ కోసం భూములు పరిశీలిస్తున్నట్టు  వార్తలు వచ్చాయి. 
 
వీటిపై గౌతం సవాంగ్ స్పందించారు. అది పూర్తిగా ఊహాజనితమని కొట్టిపడేశారు. హైదరాబాద్ గ్రేహౌండ్స్ తరహాలోనే రాష్ట్రంలోనూ ఆ విభాగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుతామన్న ఆయన విశాఖపట్టణం శివారులోని ఆనందపురంలో 384 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. 
 
అలాగే, సంస్థ నిర్వహణ, శిక్షణ కోసం కేంద్రం రూ.220 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అయితే, ప్రభుత్వం కేటాయించిన భూమి భవిష్యత్ అవసరాలకు సరిపోదని, కాబట్టి మరిన్ని భూములను పరిశీలించినట్టు చెప్పారు.
 
ఇకపోతే, బెంగళూరు, గోవా నుంచి విజయవాడ, విశాఖ, గుంటూరు ప్రాంతాలకు డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయన్న డీజీపీ.. ఏపీ, ఒడిశా సరిహద్దులోని గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న గంజాయి సాగుకు మావోయిస్టుల సహకారం ఉందన్నారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 466 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని పేర్కొన్న ఆయన గత నెల రోజుల్లోనే 421 మందికి ఈ మహమ్మారి సంక్రమించిందని వివరించారు. 
 
కాగా, ఏపీ ప్రభుత్వం రాజధానిని మూడుగా విభజించి, అందులో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖకు తరలించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులోభాగంగానే డీజీపీ గౌతం సవాంగ్ విశాఖలో పర్యటించినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

తర్వాతి కథనం
Show comments