Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో కాల్‌మనీ కలకలం

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (17:52 IST)
గుంటూరులో కాల్‌మనీ కలకలం రేపింది. రత్నారెడ్డి అనే వడ్డీ వ్యాపారి తమ నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదు చేశారు. స్పందనలో ఫిర్యాదు రావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, నిఘాలో ఉంచారు.

తర్వాత ఆయన ఆఫీసులో తనిఖీలు చేపట్టి, బ్యాంకు పాస్‌బుక్కులు, ఏటీఎం కార్డులు, పొలం పాస్ బుక్కులు, ఖాళీ ప్రామీసరీ నోట్లతో పాటు కొన్ని దస్తావేజులు పోలీసులకు లభించాయి.

రత్నారెడ్డి కేవలం ఉద్యోగస్థులను టార్గెట్ చేసుకొని వడ్డీ వ్యాపారం చేస్తున్నాడని, బాధితులెవరైనా ఉంటే తమకు మరింత సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. మరోవైపు రత్నారెడ్డి నుంచి లక్ష నలబై వేల నగదు, 38 పాస్ బుక్కులు, దాదాపు వంద ఖాళీ ప్రామీసరీ నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments