Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 23న రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకి పట్టాభిషేకం చేస్తారు.. బుద్ధా వెంకన్న

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (14:32 IST)
శ్రీరామ పట్టాభిషేకం తరహాలో మే 23న రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకి పట్టాభిషేకం చేయనున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. ఎవరెన్ని అవాకులు చవాకులు పేలినా.. ఐదేళ్ల పాటు ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన చంద్రబాబే మళ్లీ అధికారంలోకి వస్తారన్నారు. 
 
విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. వైకాపా, భాజపా నాయకులపై మండిపడ్డారు. ఈవీఎం లోపాలపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తుంటే, ఆయనకు ఓటమి భయం పట్టుకుందంటూ విపక్ష నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. 
 
ఈవీఎంలు పనిచేయక మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడితే.. వైకాపా నేత విజయసాయి రెడ్డి ఈసీ బాగా పనిచేసిందంటూ కితాబివ్వడమేంటని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ లో క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈవీఎంలు వినియోగిస్తే ఫలితాలు తారుమారు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో 25 లక్షల ఓటర్లను తొలగించారని, అక్కడ జరిగిన ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్ ‘సారీ’ చెప్పి చేతులు దులుపుకుందని అన్నారు. 
 
తెలంగాణలో సాంకేతికతను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి కూడా ఇబ్బంది తప్పలేదని, ఏపీలో ఎన్నికల నిర్వహణ తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments