Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవిష్యత్ బెంగతో పెళ్లి కొడుకు ఆత్మహత్య .. ఎక్కడ?

Webdunia
గురువారం, 12 మే 2022 (07:20 IST)
విశాఖపట్టం జిల్లా మల్కాపురంలో మరికొన్ని గంటల్లో పెళ్ళిపీటలెక్కాల్సిన పెళ్ళి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భవిష్యత్ బెంగతోనే తాను బలవన్మరణానికి పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో రాశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విశాఖ నగరం మల్కాపురం ప్రాంతంలోని జై ఆంధ్రా కాలనీకి చెందిన పాటి దినేష్ (25) అనే యువకుడు హెచ్.పి.సి.ఎల్‌లో కాంట్రాక్టు కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఆయనకు పెందుర్తి సమీపంలోని పెదగాడి ప్రాంతానికి చెందిన ఓ యువతితో నిశ్చితార్థమైంది. వీరిద్దరికి పెళ్లి బుధవారం రాత్రి 10.15 గంటలకు జరగాల్సివుంది. ఇందుకోసం మంగళవారం దినేశ్‌ను పెళ్ళి కుమారుడిని చేసి పెళ్లికి వచ్చిన బంధువులంతా సరదాగా గడిపారు. 
 
ఆ తర్వాత వేకువజామున మిద్దెపైకి వెళ్ళిన వరుడు చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దినేశ్ రాసినట్టుగా భావిస్తున్న సూసైడ్ నోట్ లభ్యమైంది. ఇందులో తనను ఇంట్లో చిత్ర హింసలు పెడుతున్నారని, కంపెనీలో పనికి వెళితే కాంట్రాక్టర్ అతని సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారని, భవిష్యత్ బెంగతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. దీంతో భాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట చావుడప్పులు మోగాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments