Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి మండపం నుంచి వధువు పరార్..

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (15:18 IST)
పెళ్లి మండపం నుంచి వధువు పరారైన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట మండలం బలిజపల్లెకు చెందిన యువకుడు (26)కి తంబళ్లపల్లె మండలం కొటాల పంచాయతీ పరిధిలోని గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. 
 
వివాహం జరగాల్సి ఉండడంతో మదనపల్లె చేరుకున్న వధూవరుల కుటుంబ సభ్యులు అమ్మచెరువు సమీపంలోని కల్యాణ మండపంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు.
 
ఇక మంగళవారం రాత్రి వధూవరులకు నలుగుపెట్టారు. ఈ తంతు పూర్తయిన తర్వాత రాత్రికి రాత్రే కుటుంబ సభ్యుల కళ్లుగప్పి వధువు పరారైంది. 
 
విషయం తెలిసిన ఇరు కుటుంబాల సభ్యులు షాక్‌కు గురయ్యారు. మరోవైపు, తనకు అవమానం జరిగిందంటూ వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా, వధువు మైనర్ అని తేలింది. దీంతో దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments