Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ అండగా ఉండకపోవచ్చు .. కురుక్షేత్ర సంగ్రామంలో నా సైన్యం ప్రజలే.. : వైఎస్ జగన్

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (13:43 IST)
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం వంటివని ఈ ఎన్నికల్లో తనకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని అనుకోవడం లేదని, అందువల్ల ఈ ఎన్నికల్లో తన సైన్యం ప్రజలేనని స్పష్టం చేశారు. నాలుగో విడత ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా క్రోసూరులో ఆయన ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల్లో మెరుగైన విద్యను అందించేందుకు ఈ నాలుగేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే రోజునే విద్యాకానుక అందిస్తున్నామని చెప్పారు. 
 
ఆ తర్వాత ఎప్పటిలాగే విపక్షాలపై ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు చేసే సీఎం జగన్ ఈ దఫా బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమకు అండగా ఉండకపోవచ్చన్నారు. 
 
అందువల్ల జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో తమ సైన్యం ప్రజలేనని అన్నారు. మీ ఇంట్లో మం.చి జరిగిందా లేదా అన్నదే కొలమానంగా తీసుకోవాలని, మంచి జరిగితే మీ బిడ్డకు అండగా నిలబడాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments