Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి జగన్ కూడా అదే ధోరణిలో వెళ్తున్నారు.. కన్నా

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (16:19 IST)
విజయవాడలో బీజేపీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, రాజ్యసభ సభ్యులు జీవిఎల్, సుజనా చౌదరి, సిఎం రమేష్, బిజెపి నేతలు, మురళీధర్, సునీల్ దియోధర్, హరిబాబు పాల్గొన్నారు. 
 
ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. బీజేపీ సభ్యత్వాన్ని ప్రారంభీంచినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి తమ పార్టీలో చేరుతున్నారు.. 2019 వరకు మోదీ చేసిన అభివృద్ధిని కప్పిపెట్టారు. మళ్ళీ మోదీ అధికారంలొకి వచ్చాక వాస్తవాలు తెలుసుకొని బీజేపీలో చేరుతున్నారు .
 
 
కాశ్మీర్ సమస్యను రెండు రోజుల్లోనే అతి సులువుగా పరిష్కరించిన వ్యక్తి మోదీ
దేశ చరిత్రలో ఆగస్టు 15 ఎంత ముఖ్యమో ఆగస్టు 5, 6 తేదీలు అంతే ముఖ్యమని చెప్పారు. ఈ నెల 20వరకు బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ కొనసాగుతుంది. బీజేపీ శ్రేణులన్నీ పాల్గొనాలి.
 
ఏపీలో ప్రస్తుత ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని భావించాం. కానీ ముఖ్యమంత్రి ఆవేశం, అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. 
 
గతంలో బీజేపీ నేతలను టీడీపీ నేతలు ఎలా ఇబ్బంది పెట్టారో.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అదే ధోరణిలో వెళుతున్నారు. ఈ నెల 16న గురజాలలో పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా, ఇసుక కొరత, రాయలసీమ కరువు వంటి అంశాలపై ధర్నాకు దిగుతున్నామని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments