Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంపు ప్రాంతాల్లో టిడిపి బృందం పర్యటన

ముంపు ప్రాంతాల్లో టిడిపి బృందం పర్యటన
, శుక్రవారం, 9 ఆగస్టు 2019 (06:10 IST)
తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. స్థానిక నేతలతో కలిసి ఆయన 
సీతానగరం, పోచమ్మ గండి, దేవి పట్నం ప్రాంతాలను పరోశీలించారు. నీట మునిగిన గ్రామాల్లో పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, జరిగిన నష్టం, అందుతున్న సహాయం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
 
"వరద వస్తుందని తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వరద బాధితులకు పునరావాసం సహాయ కార్యక్రమాలు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. వరద బాధితులు పది రోజులుగా నీటిలో ఉన్నారు. కనీసం వారికి టార్పాలిన్లు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.  వరద వచ్చి పది రోజులు అవుతున్న ఇంకా సోలార్ లైట్లు వస్తున్నాయని అంటున్నారు. 
 
కొంపదీసి గోదావరిలో కలిసిపోయాయి ఏంటో? మంత్రులు  వచ్చి చూసి వెళ్లడం తప్ప ఏం చేయలేదు. ఇక్కడ ఉన్న అధికారులు బదిలీలు చేసి కొత్త అధికారులను ఇక్కడ వేశారు. అందుచేత సహాయ కార్యక్రమాలు కొనసాగడం లేదు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఆహారం పాలు, త్రాగు నీరు సరఫరా చేయలేదు.
 
 జగన్ గాల్లో తిరిగితే సహాయక చర్యలు జరగవు. వరద బాధితులకు నెలకు పది వేలు చొప్పున మూడు నెలలకు 30 వేల రూపాయలు పరిహారం వెంటనే చెల్లించాలి. వరద తగ్గిన తర్వాత నష్టపరిహారం అంచనా వేసి త్వరితగతిన సహాయం అందించాలి. గండికోట నిర్వాసితుల మాదిరిగా పోలవరం నిర్వాసితుల కూడా పరిహారం చెల్లించాలి.
 
 వరద బాధితులకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. నష్టం పై పూర్తి స్థాయి అంచనా వేసుకొని బాధితులకు న్యాయం జరిగే వరకూ వారికి మద్దతుగా నిలుస్తాం" అన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సేవలు ప్రజల ఇంటి ముంగిటకు... పౌర సంబంధాల శాఖా మంత్రి నాని