Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్నెవ్వరూ ఏమీ చేయలేరు.. నేనే అధ్యక్షుడిగా కొనసాగుతా...

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (12:57 IST)
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీకి చెందిన అధినాయకులను మారుస్తారన్న ప్రచారం బాగానే సాగుతోంది. పార్టీని బలోపేతం చేయడంలో కొంతమంది ఫెయిలయ్యారని.. దీంతో అమిత్ షా వారిపై ఆగ్రహంతో ఉన్నారని, ఏ క్షణమైనా అధ్యక్షులు మారే అవకాశం ఉందన్న ప్రచారం ఆ పార్టీలోనే తీవ్రస్థాయిలో జరుగుతోంది.
 
ఈ నేపథ్యంలో తిరుపతిలో పర్యటించారు కన్నా లక్ష్మీనారాయణ. కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. తానే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా కొనసాగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎపిలో బిజెపిని పటిష్టపరచడంలో తాను సఫలీకృతుడినయ్యానని, అందుకే అమిత్ షా తనను ఆ పదవి నుంచి తొలగించరన్న నమ్మకం ఉందన్నారు కన్నా. 
 
సభ్యత్వ నమోదులో కూడా ఎపిల ముందంజలో వున్నామన్న కన్నా లక్ష్మీనారాయణ.. వైసిపి నుంచి బిజెపిలోకి నేతలు క్యూ కడుతున్నారని చెప్పుకొచ్చారు. త్వరలో మరికొంతమంది నేతలు బిజెపిలో చేరుతారని.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ 40 రోజుల పాలన అస్తవ్యస్తంగా తయారైందని.. రైతులు విత్తనాలు లేక, పంట చేతికందక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments