Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. కరెంట్ షాకిచ్చి చంపేద్దామనుకున్న భర్త.. ఏం జరిగిందటే?

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (12:49 IST)
ఒక భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తన స్నేహితుడితో భార్య శారీరకంగా కలుస్తోందని అనుకున్నాడు. ఎలాగైనా తన భార్యను, అతని ప్రియుడ్ని చంపేయాలని ప్లాన్ చేశాడు. చివరకు వారు తప్ప అభంశుభం తెలియని వారు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పశ్చిమబెంగాల్ లోని దక్షిణ పరిగణాల జిల్లాలో జరిగిన సంఘటన సంచలనం రేపుతోంది.
 
భవన కార్మికుడుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి తన బంధువులతో కలిసి నివాసముంటున్నాడు. అతని కుటుంబంతో పాటు అతని బంధువులు కూడా కలిసి ఉంటున్నారు. అయితే గత నెలరోజుల నుంచి తన భార్య.. తన స్నేహితుడు.. బంధువుతో కలిసి ఉందని అనుమానం పెంచుకున్నాడు.
 
భార్యకు చాలాసార్లు చెప్పాడు. అయితే అదంతా లేదని ఆమె చెప్పింది. అయినా సరే ఒప్పుకోలేదు. ఎలాగైనా తన భార్యను, ప్రియుడిని చంపేయాలని ప్లాన్ చేశాడు. ఇంటి ముందున్న కరెంటు వైర్లను తెంచి వదిలేశాడు. తాను బయటకు వెళ్లి బట్టలను తగులబెట్టి ఇళ్ళు తగలబడిపోతోందని గట్టిగా అరిచాడు. 
 
ఇంట్లోని వారందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. దీంతో బంధువులు ముగ్గురు విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అతని భార్య, ప్రియుడు మాత్రం సేఫ్‌గా ఉన్నారు. గ్రామస్తులు విషయం తెలుసుకుని భవన కార్మికుడిని చితకబాదారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments