Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలో - టిక్‌టాక్‌లపై నిషేధమా? కేంద్రం కొరఢా

హెలో - టిక్‌టాక్‌లపై నిషేధమా? కేంద్రం కొరఢా
Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (12:37 IST)
ప్రస్తుతం కొత్తగా వచ్చిన సామాజిక మాధ్యమాలు హెలో - టిక్‌టాక్‌. ఇవి నెటిజన్లలో మంచి పాపులర్ అయ్యాయి. అయితే, వీటివల్ల అనేకు దుష్ఫరిణామలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వీటిపై నిషేధం విధించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. తాము సంధించిన 24 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని లేనిపక్షంలో నిషేధం ఎదుర్కోక తప్పదంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. 
 
అయితే, ఈ నోటీసులు జారీచేయడానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్. హెలో, టిక్‌టాక్‌ యాప్‌లు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని పేర్కంటూ ఆ సంస్థ ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశాయి. దీంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సదరు సంస్థలకు నోటీసు జారీచేసింది. ఈ నోటీసుల్లో పలు ప్రశ్నలను సంధించింది. 
 
అలాంటివాటిలో చిన్నారులు కూడా ఈ యాప్ వాడేలా ఎందుకు అనుమతిస్తున్నారంటూ ప్రశ్నించింది. అలాగే, భారతీయుల వివరాలను ఇంకెప్పుడూ విదేశీ ప్రభుత్వాలకు ఇవ్వబోమని హామీ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో కోరింది. 
 
దీనిపై టిక్‌టాక్, హెలో అప్లికేషన్ సంస్థలు సంయుక్తంగా స్పందించాయి. తమకు భారత్ అతిపెద్ద మార్కెట్ అని, అందువల్ల భారత ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు పూర్తిగా సహకరిస్తామని అక్కడి సమాజం పట్ల భాధ్యతతో వ్యవహరిస్తామని వారు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments