హెలో - టిక్‌టాక్‌లపై నిషేధమా? కేంద్రం కొరఢా

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (12:37 IST)
ప్రస్తుతం కొత్తగా వచ్చిన సామాజిక మాధ్యమాలు హెలో - టిక్‌టాక్‌. ఇవి నెటిజన్లలో మంచి పాపులర్ అయ్యాయి. అయితే, వీటివల్ల అనేకు దుష్ఫరిణామలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వీటిపై నిషేధం విధించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. తాము సంధించిన 24 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని లేనిపక్షంలో నిషేధం ఎదుర్కోక తప్పదంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. 
 
అయితే, ఈ నోటీసులు జారీచేయడానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్. హెలో, టిక్‌టాక్‌ యాప్‌లు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని పేర్కంటూ ఆ సంస్థ ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశాయి. దీంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సదరు సంస్థలకు నోటీసు జారీచేసింది. ఈ నోటీసుల్లో పలు ప్రశ్నలను సంధించింది. 
 
అలాంటివాటిలో చిన్నారులు కూడా ఈ యాప్ వాడేలా ఎందుకు అనుమతిస్తున్నారంటూ ప్రశ్నించింది. అలాగే, భారతీయుల వివరాలను ఇంకెప్పుడూ విదేశీ ప్రభుత్వాలకు ఇవ్వబోమని హామీ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో కోరింది. 
 
దీనిపై టిక్‌టాక్, హెలో అప్లికేషన్ సంస్థలు సంయుక్తంగా స్పందించాయి. తమకు భారత్ అతిపెద్ద మార్కెట్ అని, అందువల్ల భారత ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు పూర్తిగా సహకరిస్తామని అక్కడి సమాజం పట్ల భాధ్యతతో వ్యవహరిస్తామని వారు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments