Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతవాళ్లు కూడా నేను ఓడిపోవాలని కోరుకుంటున్నారు : ఎమ్మెల్యే రాజాసింగ్

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (16:05 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత పార్టీ నేతలు సైతం వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోవాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. అందువల్ల వచ్చే ఎన్నికల తర్వాత అసెంబ్లీలో తాను ఉండకపోవచ్చని తెలిపారు. ఎన్నికల్లో తన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగిపోయిందని చెప్పారు. ఇతర పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా తాను ఓడిపోవాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణాలో ఏర్పడే ప్రభుత్వం ఆశీస్సులు తన నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్టు రాజాసింగ్ చెప్పారు. ఈయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 
 
జంట నగరాల్లో రాజా సింగ్‌కు బీజేపీ శ్రేణుల్లో మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే, గత యేడాడి ఆయన మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. దీంతో బీజేపీ పెద్దలు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ నుంచి తొలగించింది. శాసనసభాపక్ష నేతల పదవి నుంచి తప్పించింది. ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు కావడంతో రాజా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రాజా సింగ్ తాజాగా అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments