Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతవాళ్లు కూడా నేను ఓడిపోవాలని కోరుకుంటున్నారు : ఎమ్మెల్యే రాజాసింగ్

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (16:05 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత పార్టీ నేతలు సైతం వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోవాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. అందువల్ల వచ్చే ఎన్నికల తర్వాత అసెంబ్లీలో తాను ఉండకపోవచ్చని తెలిపారు. ఎన్నికల్లో తన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగిపోయిందని చెప్పారు. ఇతర పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా తాను ఓడిపోవాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణాలో ఏర్పడే ప్రభుత్వం ఆశీస్సులు తన నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్టు రాజాసింగ్ చెప్పారు. ఈయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 
 
జంట నగరాల్లో రాజా సింగ్‌కు బీజేపీ శ్రేణుల్లో మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే, గత యేడాడి ఆయన మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. దీంతో బీజేపీ పెద్దలు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ నుంచి తొలగించింది. శాసనసభాపక్ష నేతల పదవి నుంచి తప్పించింది. ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు కావడంతో రాజా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రాజా సింగ్ తాజాగా అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments