Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ద్రౌపది ముర్ము నామినేషన్ - పత్రాలపై సంతకం చేసిన సీఎం రమేష్

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (08:16 IST)
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం రూపొందించిన నామినేషన్ పత్రంలో సంతకం చేసే గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్క సీఎం రమేష్‌కు మాత్రమే దక్కింది. ఈయన టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడుగా ఎంపికై ఇపుడు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. 
 
ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థులను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన 50 మంది ప్రతిపాదించాల్సివుంది. మరో 50 మంది బలపరచాల్సివుంది. ఈ క్రమంలో ముర్ము నామినేషన్‌కు బీజేపీ ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసింది. ఇందులోభాగంగా, ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే వారి జాబితాలో ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు దక్కింది. 
 
బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ద్రౌపది ముర్మును ఎన్డీయే అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ గురువారమే సీఎం రమేష్ ప్రతిపాదన పత్రంపై సంతకం చేశారు. ఇలా ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే అవకాశం దక్కిన నేతల్లో ఏపీ నుంచి సీఎం రమేష్‌ ఒక్కరే ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments