Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ద్రౌపది ముర్ము నామినేషన్ - పత్రాలపై సంతకం చేసిన సీఎం రమేష్

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (08:16 IST)
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం రూపొందించిన నామినేషన్ పత్రంలో సంతకం చేసే గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్క సీఎం రమేష్‌కు మాత్రమే దక్కింది. ఈయన టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడుగా ఎంపికై ఇపుడు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. 
 
ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థులను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన 50 మంది ప్రతిపాదించాల్సివుంది. మరో 50 మంది బలపరచాల్సివుంది. ఈ క్రమంలో ముర్ము నామినేషన్‌కు బీజేపీ ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసింది. ఇందులోభాగంగా, ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే వారి జాబితాలో ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు దక్కింది. 
 
బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ద్రౌపది ముర్మును ఎన్డీయే అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ గురువారమే సీఎం రమేష్ ప్రతిపాదన పత్రంపై సంతకం చేశారు. ఇలా ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే అవకాశం దక్కిన నేతల్లో ఏపీ నుంచి సీఎం రమేష్‌ ఒక్కరే ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments