Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో ఘాతుకం: నల్లగొండ టెక్కీని కాల్చి చంపేశారు..

అమెరికాలో ఘాతుకం: నల్లగొండ టెక్కీని కాల్చి చంపేశారు..
, బుధవారం, 22 జూన్ 2022 (12:07 IST)
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. మేరీలాండ్‌లో నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ పట్టణానికి చెందిన నక్కా సాయి చరణ్ మేరీలాండ్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. 
 
ఆదివారం సాయి చరణ్ తన స్నేహితులను ఎయిర్ పోర్ట్‌లో డ్రాప్ చేసి కారులో తిరిగి వెళుతుండగా ఈ ఘాతుకం జరిగింది. కారును ఆపిన నల్ల జాతీయులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో సాయి చరణ్ స్పాట్ లోనే చనిపోయారు. సాయి కుమార్ మృతితో  అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
 
అమెరికాలో  ఎమ్మెస్ పూర్తిచేసిన సాయి చరణ్... ఆరు నెలల క్రితమే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరారు. మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్‌‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగ చేస్తున్నారు. 
 
సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాకా ఇంటికి రాలేదు. సెప్టెంబర్ లోనే ఇండియాకు రావాల్సి ఉంది. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో నల్లజాతీయుల చేతిలో చనిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జులై 4న ప్రధాని పర్యటన: ఒక్క రోజు లేటుగా పాఠశాలల పునఃప్రారంభం