అమ్మతోడు.. ఆంధ్రాలో ఒక్క సీటు రాదంటున్న బీజేపీ నేత

Webdunia
మంగళవారం, 21 మే 2019 (13:09 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీ బుధవారం వెల్లడికానున్నాయి. ఈ ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభానేత విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మలేమన్నారు. కానీ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా కాషాయం జెండా రెపరెపలు కనిపించినప్పటికీ.. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. కానీ, అసెంబ్లీ ఎన్నిక్లలో మాత్రం మూడు సీట్లను గెలుచుకునే అవకాశం ఉందన్నారు.
 
'నేను విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేశాను. అక్కడ టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఖచ్చితంగా ఓడిపోతారు. అయితే వైసీపీ అభ్యర్థి.. లేదంటే నేను గెలుస్తాం' అని వ్యాఖ్యానించారు. 
 
23వ తేదీన వెలువడే ఫలితాలతో అందరికీ అర్థమవుతుందన్నారు. మోడీ వ్యతిరేక పవనాలు తీసుకురావడానికి ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నించినప్పటికీ వారి ఆటలు సాగలేదని, ఎవరి సహాయ సహకారాలు అవసరం లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
 
ఇకపోతే, బీజేపీకి సొంతగా 280కి పైగా సీట్లు వస్తాయన్నారు. విజయవాడ నుంచి ఢిల్లీ వచ్చి కొంత మంది అందరినీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఆ ప్రయత్నాలు వృథా అవుతాయి కాబట్టి అలాంటివి చేయవద్దని సూచించారు. 
 
జాతీయ స్థాయిలో బీజేపీ శాస్త్రీయంగా సర్వే చేయించిందని, అందులో తక్కువలో తక్కువ 280 సీట్లు వస్తున్నాయని తేలిందన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొంతమేరకు నష్టం జరిగినప్పటికీ ఆ రాష్ట్రంలో కూడా కనీసం 60 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments