Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇప్పటికే యాభై సార్లు చెప్పా.. మోడీనే ప్రధాని : నితిన్ గడ్కరీ

ఇప్పటికే యాభై సార్లు చెప్పా.. మోడీనే ప్రధాని : నితిన్ గడ్కరీ
, మంగళవారం, 21 మే 2019 (10:16 IST)
ఈ నెల 23వ తేదీ తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజార్టీ వస్తుందని, ఆ తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి, నాగ్‌పూర్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి నితిన్ గడ్కరీ జోస్యం చెప్పారు.
 
బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ నటించిన పీఎం నరేంద్ర మోడీ చిత్ర పోస్టర్‌ను ఆయన ముంబైలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే తుది ఫలితాలు కాదన్నరు. అయితే, బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే సంకేతాలను మాత్రం ఇచ్చాయని ఆయన గుర్తుచేశారు. 
 
ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నారన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫైనల్ కాదని, ఎగ్జిట్ పోల్స్‌లో ఉన్నది తుది ఫలితాల్లో ప్రతిబింభిస్తుందన్నారు. ప్రధాని అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానంగా... నరేంద్ర మోడీ నాయకత్వంలో తాము ఎన్నికలకు వెళ్లామని ఇప్పటికే 20 నుంచి 50 సార్లు చెప్పానని గడ్కరీ అన్నారు. మోడీనే మరోసారి ప్రధాని అవుతారని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు ముందస్తు బెయిలిస్తేనే అజ్ఞాతం వీడుతా : రవి ప్రకాష్