Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతే.. ఎక్కడికీ కదలదు : కమలసేన

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (10:25 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఎక్కడికీ కదలదని భారతీయ జనతా పార్టీ - జనసేన పార్టీలు స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని ఆ పార్టీ అధిపతులు కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్‌లు స్పష్టం చేశారు.
 
ఇరు పార్టీల నేతల సమావేశం గురువారం విజయవాడలో జరిగిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ, అసెంబ్లీలో 151 మంది శాసనసభ్యులు ఉన్నారనీ, తాము ఏమైనా చేస్తామని అనుకుంటే కదరదన్నారు. అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ కదలనివ్వబోమని తేల్చిచెప్పారు. 
 
ఏపీ భవిష్యత్‌, రాష్ట్ర ప్రజల హితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ జగన్‌ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు పోతోందని ఆక్షేపించారు. 'రాష్ట్ర రాజధానిగా అమరావతిని అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ లోపల, బయటా అంగీకరించాయి. ఇప్పుడు జగన్‌ దానిని మారుస్తానంటూ ఏకపక్షంగా ముందుకెళ్తే ఎలా సాధ్యమవుతుంది? బీజేపీ-జనసేన ఉమ్మడి పోరాటంతో ప్రజల్లోకి వెళ్తాయి' అని స్పష్టం చేశారు. 
 
ఆ తర్వాత బీజేపీ ఢిల్లీ దూత, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ డియోధర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు కులం, కుటుంబం, అవినీతి, అరాచకమనే గ్రహణాలు పట్టాయి.. జాతీయవాదం, అవినీతి రహితం, ప్రజా సంక్షేమం అనే ఆయుధాలతో వాటిని ఓడిస్తాం.. బంగారు ఆంధ్రప్రదేశ్‌ సాధిస్తాం అని చెప్పుకొచ్చారు. మరో జాతీయ నే జీవీఎల్ నరసింహా రావు స్పందిస్తూ, రెండు పార్టీలు కలవడం శుభపరిణామమని, విజయ బావుటా ఎగురవేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments