Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో ఆంధ్రా రోడ్లా.. నరకాన్ని తలపిస్తున్నాయ్.. బీజేపీ ఎంపీ సోయం బాపురావు

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (08:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రహదారులపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ సోయం బాపురావు తనదైనశైలిలో స్పందించారు. వామ్మో.. ఆంధ్రా రోడ్లా.. నరకాన్ని తలిపిస్తున్నాయంటూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. పైగా, పాడేరును తలచుకుంటే జాలేస్తుందంటూ వ్యాఖ్యానించారు. 
 
ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం జనజాతి సురక్ష మంచ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్ఛా అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వర రావు, కేంద్ర ఫిలింబోర్డు సభ్యుడు చల్లా రామకృష్ణ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా బాపురావు విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రా రోడ్లు మరింత అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు మూడున్నర గంటల సమయం పట్టిందన్నారు. తమ రాష్ట్రం వెనకబడివుందని అనుకున్నామని, కానీ, ఇక్కడ పరిస్థితులు మరింత దారుణంగా, అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని అన్నారు. పాడేరువాసులలు విశాఖపట్టణం ఎలా వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
 
రాష్ట్ర విభజన తర్వాత కూడా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందకపోవడం దారుణమన్నారు. కొన్ని కొండ గ్రామాల్లో ఇంకా చదువుకోనివారు ఉన్నారంటే ఆశ్చర్య కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా రహదారుల అభివృద్ధి ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments