Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే బీచ్‌లో వివాహిత మిస్సింగ్: గాలింపు కోసం కోటి ఖర్చు, కానీ ఆమె ప్రియుడితో నెల్లూరులో...

Webdunia
బుధవారం, 27 జులై 2022 (21:25 IST)
విశాఖపట్టణం ఆర్కే బీచ్‌లో ఓ వివాహిత మిస్సింగ్ అయిన కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈమె తన ప్రియుడితో కలిసి పారిపోయినట్టు తేలింది. ఈ వివాహిత కోసం 36 గంటల పాటు పోలీసులు గాలించారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా, అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

 
ఈ వివాహిత పేరు సాయిప్రియ. ఈమె బీచ్ తీరంలో అలలు సముద్రంలోకి కొట్టుకునిపోయివుంటుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆమె నెల్లూరులో ప్రత్యక్షమైంది. సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్టు ఆమె బంధువులు గుర్తించారు. ప్రేమికుడితో కలిసి పారిపోయినట్టు తేలింది. 

 
ఈమె భర్త శ్రీనివాస్‌తో జరిగిన వివాహం కంటే సాయి ప్రియ నెల్లూరుకు చెందిన రవి అనే వ్యక్తిని ప్రేమించింది. పైగా, వివాహానికి ముందే ప్రియ రెండుసార్లు తన ప్రియుడు రవితో కలిసి పారిపోయింది. ఆ తర్వాత తల్లిదండ్రులు, బంధువులు ఒత్తిడి చేయడంతో సాయిప్రియ బలవంతంగా శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకుంది. కానీ ప్రియుడిని మాత్రం మరిచిపోలేక పోయింది. 

 
ఈ క్రమంలో శ్రీనివాస్ హైదరాబాద్ నగరంలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తుండటంతో అక్కడే కాపురం పెట్టింది. అదేసమయంలో తన ప్రియుడితో మాత్రం టచ్‌లో ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ హైదారాద్ నగరం నుంచి విశాఖకు వచ్చింది.

 
ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ వారి రెండో వివాహ వేడుక కోసం శ్రీనివాస్ విశాఖకు వచ్చారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని ముందుగానే తన ప్రియుడు రవికి సాయిప్రియ సమాచారం ఇచ్చింది. అక్కడ నుంచి పక్కా ప్లాన్‌తో సాయిప్రియ తన ప్రియుడు రవితో కలిసి పారిపోయింది. 

 
తన భార్య కనిపించకపోవడంతో శ్రీనివాస్ తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నావికా సిబ్బంది సహకారంతో హెలికాప్టరు ద్వారా కూడా గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇందుకుగాను కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments