Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లోరిడాలో పారాసెయిలింగ్ ప్రమాదంలో బాపట్ల మహిళ మృతి

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (07:52 IST)
అమెరికాలో జరిగిన  పారాసెయిలింగ్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లకు చెందిన సుప్రజ (34) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈమెకు భర్త శ్రీనివాసరావు, అక్షిత్ చౌదరి, శ్రీ అధిరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కుమారుడు అక్షిత్‌తో కలిసి సుప్రజ బోటు పారాసెయిలింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. 
 
బలమైన గాలులు వీయడంతో ఆ పారాచ్యూట్‌ను బోటుకు అనుసంధానించిన తాళ్లు తెగిపోయాయి. దీంతో ఆ పారాచ్యూట్ ఓ వంతెనను బలంగా తాకడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సుప్రజ ప్రాణాలు కోల్పోగా, కుమారుడు తేలికపాటి గాయాలతో బయటపడ్డాడు. 
 
ఇదిలావుంటే, బాపట్ల జిల్లా మార్టూరు మండలం చింతపల్లిపాడుకు చెందిన శ్రీనివాసరావు దంపతులు గత 2012లో అమెరికా వెళ్ళారు. శ్రీనివాస రావు షికాగోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అక్కడ నుంచి తమ మకాంను ఫ్లోరిడాకు మార్చారు. అక్కడ భార్యాపిల్లలతో ఉంటున్న సుప్రజ ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments