Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లోరిడాలో పారాసెయిలింగ్ ప్రమాదంలో బాపట్ల మహిళ మృతి

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (07:52 IST)
అమెరికాలో జరిగిన  పారాసెయిలింగ్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లకు చెందిన సుప్రజ (34) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈమెకు భర్త శ్రీనివాసరావు, అక్షిత్ చౌదరి, శ్రీ అధిరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కుమారుడు అక్షిత్‌తో కలిసి సుప్రజ బోటు పారాసెయిలింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. 
 
బలమైన గాలులు వీయడంతో ఆ పారాచ్యూట్‌ను బోటుకు అనుసంధానించిన తాళ్లు తెగిపోయాయి. దీంతో ఆ పారాచ్యూట్ ఓ వంతెనను బలంగా తాకడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సుప్రజ ప్రాణాలు కోల్పోగా, కుమారుడు తేలికపాటి గాయాలతో బయటపడ్డాడు. 
 
ఇదిలావుంటే, బాపట్ల జిల్లా మార్టూరు మండలం చింతపల్లిపాడుకు చెందిన శ్రీనివాసరావు దంపతులు గత 2012లో అమెరికా వెళ్ళారు. శ్రీనివాస రావు షికాగోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అక్కడ నుంచి తమ మకాంను ఫ్లోరిడాకు మార్చారు. అక్కడ భార్యాపిల్లలతో ఉంటున్న సుప్రజ ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments