Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్తల్లో నిలిచిన ఎంపీ నందిగం.. అసలేం జరిగిందంటే?

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (11:34 IST)
ఎంపీ నందిగం సురేష్ వార్తల్లో నిలిచారు. ఎంపీనని చెబుతున్నా మర్యాద ఇవ్వలేదంటూ ఓ కానిస్టేబుల్‌పై ఎంపీ నందిగం సురేశ్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కానీ విషయం బయటకు పొక్కడంతో స్పందించిన ఎంపీ సురేశ్ వెనక్కి తగ్గారు. 
 
తాను కానిస్టేబుల్‌ను ఏమీ అనలేదని, హెల్మెట్ ఉంచుకుని కూడా పెట్టుకోనందుకు తన మనిషిపైనే ఆగ్రహం వ్యక్తం చేశానని చెప్పారు. అంతేగాకుండా అదే కానిస్టేబుల్ గతంలో తాను అతడికి ఫేవర్‌గా చేసిన పనిని గుర్తు చేసుకున్నారని ఎంపీ వివరించారు.
 
అసలేం జరిగిందంటే..? అమరావతి ప్రాంతంలోని రాయపూడి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ బైకర్‌ను ఆపిన పోలీసులు పత్రాలు చూపించమని అడిగారు. 
 
అయితే, తాను ఎంపీ నందిగం సురేశ్ మనిషినని చెప్పాడు. అయినా సరే పత్రాలు చూపించాల్సిందేనని నిలదీశారు. దీంతో ఆయన ఎంపీకి ఫోన్ చేసి విషయం చెప్పి ఫోన్‌ను కానిస్టేబుల్‌కు ఇచ్చాడు. 
 
తాను ఎంపీని మాట్లాడుతున్నానని, అతడిని విడిచిపెట్టాలని సురేశ్ కోరారు. అందుకు కానిస్టేబుల్ ముక్తసరిగా సరేనని చెప్పి వదిలిపెట్టాడు.
 
అయితే, తాను ఎంపీనని చెబుతున్నా గౌరవం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సురేశ్.. వెంటనే తన ఇంటికి రావాలని ఆ కానిస్టేబుల్‌ను ఆదేశించినట్టు తెలిసింది. మరోవైపు, ఇదే విషయమై పోలీసు ఉన్నతాధికారికి ఎంపీ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments