Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్షన్ టెన్షన్.. సచివాలయ మెట్లపైనే పోయిన ప్రాణం

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (08:57 IST)
ఏపీలోని బాపట్ల జిల్లాలో పెన్షన్ టెన్షన్ మరో ప్రాణాన్ని బలితీసుకుంది. వృద్ధాప్య పింఛను తీసుకునేందుకు గ్రామ సచివాలయానికి వెళ్లిన ఆయనకు.. పింఛన్ వస్తుందో రాదో అన్న భయంతో మెట్లపైనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన గురువారం చోటు చేసుకుంది. 
 
బాపట్ల జిల్లా నగరం మండలం అద్దంకివారి పాళెంకు చెందిన మస్తాన్ రావు (78) అనే వృద్ధుడికి వలంటీరు ఈ నెల ఒకటో తేదీన పింఛను ఇవ్వలేదు. పైగా, వలంటీరు ఇంటికి రాకపోవడంతో విసుగు చెందిన వృద్ధుడు సచివాలయానికి వెళ్లాడు. 
 
వేలిముద్రలను యంత్రం తీసుకోవడం లేదని, ధ్రువపత్రాలతో రావాలని అక్కడి అధికారులు ఆయనకు సూచించారు. అలా ఒకటికి మూడు సార్లు ఇంటికి, కార్యాలయానికి తిరిగిన వృద్ధుడు సచివాలయం మెట్లెక్కుతూ కుప్పకూలారు. 
 
అధికారులు 108కి సమాచారమివ్వగా సిబ్బంది వచ్చి పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి చనిపోయారని కుమారుడు వెంకటేశ్వరరావు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments