Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసీదులలో లేదా చర్చిలలో హిందువులను పనిచేయడానికి అనుమతిస్తారా? (video)

సెల్వి
శుక్రవారం, 11 జులై 2025 (14:04 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో 1,000 మందికి పైగా హిందువులు కానివారు పనిచేస్తున్నారని వస్తున్న వార్తలపై రాష్ట్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, హిందువులు మసీదులలో లేదా చర్చిలలో పనిచేయడానికి అనుమతిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఆలయ పరిపాలనలో హిందువులు కాని వారిని తొలగించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని టీటీడీ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 
 
టీటీడీ మతపరమైన పవిత్రతను పునరుద్ఘాటించిన బండి సంజయ్.. లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగివున్న తిరుమలలో హిందువులు మాత్రమే ఆలయ నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలలో పాల్గొనాలని సంజయ్ తెలిపారు. 
 
తన మీడియా సంభాషణలో, కొండగట్టు, వేములవాడ, ఇల్లంతకుంట రామాలయంతో సహా తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాల అభివృద్ధిని చేపట్టాలని టీటీడీ  ఛైర్మన్‌ను కోరినట్లు కూడా పేర్కొన్నారు. 
 
అదనంగా, అవసరమైన నిధులను కేటాయించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురాతన దేవాలయాలను గుర్తించి పునరుద్ధరణకు మద్దతు ఇవ్వాలని ఆయన టీటీడీని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments