Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతి గ్రామాల్లో బంద్ .. మా పోరాటం ఆగదంటున్న రైతులు

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (10:55 IST)
రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులు, మహిళలపై సోమవారం అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పోలీసుల లాఠీచార్జికి నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి రాజధాని గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చింది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు.
 
మంచినీరు సహా ఏ పదార్థాలు పోలీసులకు విక్రయించరాదని నిర్ణయించుకున్నట్లు వ్యాపారులు తెలిపారు. పోలీసులు అడ్డుకుంటే జాతీయ జెండాలతో నిరసనలు తెలపాలని రాజధాని రైతులు నిర్ణయించారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజా సంఘాలు, రాజకీయపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.
 
మా పోరాటం ఆగదు: రైతులు 
మూడు రాజధానులకు అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదం తెలపడంపై రాజధాని గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మందడంలో ఉదయం నుంచి రైతుల నిరసనకు దిగారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన తమ పోరాటం ఆగదని రైతులు స్పష్టం చేశారు. సీఆర్డీఏకు నిన్న మధ్యాహ్నం వరకు అభిప్రాయాలు తెలిపే అవకాశం కోర్టు ఇచ్చిందని... కోర్టు తీర్పునకు విరుద్ధంగా గడువు కంటే ముందే మంత్రి వర్గం ఎలా ఆమోదిస్తుందని ప్రశ్నించారు. గడువుకంటే ముందే బిల్లును అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారని రైతులు నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments