Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేల్ బైపోల్ : రేసులోకి కాంగ్రెస్ అభ్యర్థి

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (11:45 IST)
కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిని ప్రకటించింది. 
 
మాజీ ఎమ్మెల్యే పిఎం కమలమ్మ పేరును అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఎఐసిసి) ప్రకటించింది. ఈ మేరకు పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈమె 2009-14లో బద్వేల్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. 
 
2014-17 మధ్య కాలంలో నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ మెంబరుగా ఉన్నారు. ఎఐసిసి మెంబరుగా, ఎపిసిసి కో-ఆర్డినేషన్‌ కమిటీ మెంబరుగా, 2019 రాష్ట్ర ఎలక్షన్‌ మేనిఫెస్టో కమిటీ మెంబరుగా పనిచేశారు. బీజేపీని ప్రశ్నించలేని స్థితిలో వైసిపి ఉందని, అన్యాయాన్ని ప్రశ్నించడానికే బద్వేల్‌లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని శైలజానాథ్‌ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments