Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం సొంత జిల్లాలో భార్య కాలు, చెయ్యి నరికేసిన భర్త..

సీఎం సొంత జిల్లాలో భార్య కాలు, చెయ్యి నరికేసిన భర్త..
, గురువారం, 16 సెప్టెంబరు 2021 (14:53 IST)
కడప జిల్లాలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. ఫలితంగా కట్టుకున్నకాడే కిరాతకంగా ప్రవర్తించాడు. అనుమానంతో భార్య కాలు, చేయి నరికివేసి, పత్తాలేకుండా పారిపోయాడు. ఈ దారుణం కడప జిల్లా చక్రాయపేట మండలం బీఎన్ తండాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
పోలీసుల కథనం ప్రకారం.. ఇస్లావత్ నాగనాయక్, ఈశ్వరమ్మ (45) భార్యాభర్తలు. 25 ఏళ్ల క్రితం వీరికి వివాహమైంది. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న నాగనాయక్ ఆమెను తరచూ వేధించడం మొదలుపెట్టాడు. 
 
ఈ క్రమంలో బుధవారం ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన నాగనాయక్ గొడ్డలితో భార్య కాలు, చేయి నరికేశాడు. వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆమెను వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు నాగనాయక్ కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బట్టలు దొంగతనం చేసిన ఏఎస్ఐ మృతి... ఎలా?