Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు- రూ.2.27 లక్షల నగదు గోవిందా

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (11:07 IST)
ATM
ఏటీఎం యంత్రాన్ని మినీ డీసీఎంలో దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన పటాన్‌చెరు రుద్రారంలో జరిగింది. ఇండీక్యాష్‌ ఏటీఎంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఎంటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లారు.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నరేష్‌ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. అపహరణ సమయానికి ఏటీఎంలో రూ.2.27 లక్షలు ఉన్నట్టు ఇండీక్యాష్‌ ప్రతినిధులు తెలిపారు. 
 
పోలీసులు క్లూస్‌ బృందాన్ని రప్పించి వివరాలు సేకరించారు. అర్ధరాత్రి ఒంటిగంట దాటాక ఘటన చోటు చేసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. దుండగులు చోరీకి ముందు సీసీ కెమెరాల తీగలు కత్తిరించారు. అక్కడికి సమీపంలో ఓ టిఫిన్‌ సెంటర్‌లో ఉన్న సీసీ కెమెరాల పుటీజీ ఆధారంగా విచారణ చేపట్టారు. 
 
ఐదుగురు వ్యక్తులు ఏటీఎంను పెకిలించి మినీ డీసీఎంలో తరలించినట్టు భావిస్తున్నారు. ఇదే ఏటీఎంలో గతంలోనూ రెండు సార్లు చోరీయత్నం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments