ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు- రూ.2.27 లక్షల నగదు గోవిందా

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (11:07 IST)
ATM
ఏటీఎం యంత్రాన్ని మినీ డీసీఎంలో దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన పటాన్‌చెరు రుద్రారంలో జరిగింది. ఇండీక్యాష్‌ ఏటీఎంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఎంటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లారు.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నరేష్‌ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. అపహరణ సమయానికి ఏటీఎంలో రూ.2.27 లక్షలు ఉన్నట్టు ఇండీక్యాష్‌ ప్రతినిధులు తెలిపారు. 
 
పోలీసులు క్లూస్‌ బృందాన్ని రప్పించి వివరాలు సేకరించారు. అర్ధరాత్రి ఒంటిగంట దాటాక ఘటన చోటు చేసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. దుండగులు చోరీకి ముందు సీసీ కెమెరాల తీగలు కత్తిరించారు. అక్కడికి సమీపంలో ఓ టిఫిన్‌ సెంటర్‌లో ఉన్న సీసీ కెమెరాల పుటీజీ ఆధారంగా విచారణ చేపట్టారు. 
 
ఐదుగురు వ్యక్తులు ఏటీఎంను పెకిలించి మినీ డీసీఎంలో తరలించినట్టు భావిస్తున్నారు. ఇదే ఏటీఎంలో గతంలోనూ రెండు సార్లు చోరీయత్నం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments