Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తీర్చమన్నందుకు బాణాలతో దాడి..

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:40 IST)
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం ఇద్దరు చెంచుల మధ్య తలెత్తిన వివాదం చివరకు ప్రాణాల మీదకు తెచ్చింది. కొట్టాలచెరువుగూడేనికి చెందిన ఉత్తలూరి లింగన్న అనే యువకుడిని అదే గూడానికి చెందిన అంకన్న బాణాలతో దాడి చేశాడు. లింగన్నకు చెందిన ద్విచక్రవాహనాన్ని అంకన్న అవసరం నిమిత్తం తీసుకున్నాడు. 
 
కాగా వాహనం మరమత్తుకు వచ్చింది. ఈ క్రమంలోనే తన వాహనాన్ని బాగు చేయించి ఇవ్వాలంటూ లింగన్న కోరాడు. అందుకు అంకన్న కూడా అంగీకరించాడు. రోజులు గడుస్తున్నా కూడా పట్టించుకోలేదు. లింగన్న నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న అంకన్న కోపంతో ఇంట్లో ఉన్న బాణంతో దాడి చేశాడు. 
 
ఈ దాడిలో లింగన్నకు ఛాతి, వీపు భాగాల్లో రెండు బాణాలు గుచ్చుకున్నాయి. వెంటనే లింగన్నను తన కుటుంబసభ్యులు ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలులో ఉన్న జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే నిందితుడు స్వయంగా వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments