Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎనిమిదేళ్ళ బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం...

ఎనిమిదేళ్ళ బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం...
, సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:20 IST)
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మూడేళ్ల బాలికకు అత్యాచారం ఆశ చూపి ఓ కామాంధుడు రేప్‌ చేశాడు. ఈ దారుణం తాజాగా జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తారకరామ నగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక ఇంటిపట్టునే ఆడుకుంటూ ఉన్నది. ఆ చిన్నారిపై కన్నేసిన జగన్నాథం అనే ఓ కామాంధుడు.. చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించాడు. దీంతో చాక్లెట్ ఇస్తాడని ఆశపడిన ఆ చిన్నారి ఇంట్లోకి వెళ్లింది. అంతే... ఆమె నోరును బలవంతంగా నొక్కిపెట్టి... చిన్నారి అని కూడా చూడకుండా అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
అప్పుడే ఆ బాలిక తల్లి అటువైపుగా వెలుతున్నప్పుడు బాలిక ఏడుపు శబ్ధం వినిపించింది. ఇక తల్లి లోపలికి వెళదామని తలుపు కొడితే తెరవడం లేదు. స్థానికుల సహాయంతో తలుపుని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసే లోపే వెనుక ద్వారం నుంచి నిందితుడు పారిపోయాడు. 
 
ఆ తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీంత నిందితుడైప పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాణాలు తీసిన టిక్‌టాక్ వీడియో..